Latest News

కొండయ్యను అభినందించిన నారా లోకేష్.


చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మద్దులూరి మాల కొండయ్య నేతృత్వంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుని బుధవారం టీడీపీ నేతలు కలిశారు. 

ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మీకు అప్పజెప్పిన అతి స్వల్ప కాలంలో అత్యంత బలోపేతంగా పార్టీని బలంగా చేసారని ఇదే పద్ధతిని కొనసాగించి చీరాలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని అక్కడ జరుగుతున్న నియోజకవర్గ కార్యకలాపాలన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు.

తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడను చీరాల వేటపాలెం మండలాల, టౌన్ తెలుగు యువత అధ్యక్షులను కూడా అభినందిస్తూ కొండయ్యకి అండదండలుగా ఉండి చీరాలలో అత్యధిక మెజార్టీతో టీడీపీ గెలుచుకుంటుందని, అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులు వంక హరికృష్ణ,టౌన్ అధ్యక్షుడు లావేటి శ్రీనివాస తేజ ,చీరాల మండలం తెలుగు అధ్యక్షుడు బోయిన శివరామకృష్ణ,వేటపాలెం మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంగళ భరత్ తదితరులు పాల్గొన్నారు.

No comments