వేరికోస్ వేయిన్స్ సమస్యను మొదటి దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం : డాక్టర్ పవన్ కుమార్.
----> చీరాలలో అత్యాధునిక వైద్య సేవలని అందిస్తాం : తాడివలస దేవరాజు
----> రక్తనాళాలు వుబ్బిన వారికి లేజర్ వైద్య చికిత్స శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చీరాలలో.
----> వేరికోస్ వేయిన్స్ సమస్యకు ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు.
హైదరాబాద్ ఏపీఎస్ హాస్పిటల్ మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వేరికోస్ వేయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ చే శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు రక్తనాళాలు ఉబ్బినవారికి , కాలల్లో పుండ్లు ఉన్నవారికి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ, గుంటూరు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునికమైన వైద్య సేవలను చీరాల ప్రజలకు అందించే లక్ష్యంతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు వైద్య బృందం పని చేస్తూ ఉందని తెలిపారు. లేజర్ ద్వారా రక్తనాళాలు ఉబ్బిన వారికి చీరాలలోనే ఆపరేషన్ చేయు సౌకర్యం ఏర్పాటు చేశామని, మరియు రక్తనాళాలు ఉబ్బిన వారికి జనరల్ ఆపరేషన్ ద్వారా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏవీఎస్ హాస్పిటల్ జియం సుదిప్త చౌదరి, బి.శ్రీనివాసరావు, వినోద్ కుమార్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments