రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటిల్లో విజేతగా సెయింట్ ఆన్స్ జట్టు
జట్టును ఓడించి విన్నర్స్ గా నిలిచిందన్నారు. ఫైనల్స్ పోటీలో రెండు సెట్సతోనే భారీస్థాయి తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. తమ కళాశాల జట్టులో రమణ, రేవంత్, మణి కుమార్, శివా రెడ్డి, విష్ణు బాబు, తాతాజీ, సాయికృష్ణ, ఆండ్రూస్, తేజా రెడ్డి, సాయి, సన్ని, మణికంఠలు పాల్గొన్నట్లు తెలిపారు. విన్నర్స్ గా నిలిచిన ఈ జట్టుకు రు.10,000 బహుమతితో పాటు క్రీడాకారులకు వ్యక్తిగత సర్టిఫికెట్స్, కప్పును బహుకరించారని తెలిపారు. గెలుపొందిన జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్ అనిల్ కుమార్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి, వివిధ విభాగాధిపతులు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు అభినందనలు తెలిపారు.
No comments