నిబంధనలు అతిక్రమించిన వారిపై రౌడీషీట్: ఎస్సై శివకుమార్
చీరాల (chirala) :రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవురివారి పాలెం గ్రామంలో
ఈపూరుపాలెం ఎస్సై శివకుమార్ శుక్రవారం పర్యటించారు. త్వరలో జరిగే ఎన్నికలపై
ఆయా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని సూచించారు. ఎలాంటి ఘర్షణలకు
పాల్పడరాదని వారిని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించితే రౌడీ షీటర్ ఓపెన్
చేస్తామని హెచ్చరించారు.
No comments