Latest News

చీరాల లో ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్

బాపట్ల జిల్లా (chirala):రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో గెలిచేది వైయస్సార్సీపి అని  ఎమ్మెల్యే అభ్యర్థి కరుణ వెంకటేష్ పేర్కొన్నారు.శనివారం రాత్రి చీరాల మండలం దేవినూతల పంచాయితీ లో పోలేరమ్మ గుడి దగ్గర నుండి చీరాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ఆయన సతీమణి గితతో కలిసి  ప్రచారం మొదలుపెట్టారు.ప్రచారం లో భాగంగా కరణం వెంకటేష్  ప్రతి ఇంటికి వెళ్ళి  జగనన్న చేసిన సంక్షేమలను వివరిస్తూ  జగనన్నను గెలిపించుకోవాలని కోరారు. జగనన్న ప్రతి పిల్లవాడికి మామగా, ప్రతి తల్లికి ఇంటి పెద్ద కొడుకులా, ప్రతి అవ్వకు మనవడిల,అందరినీ ఆదరిస్తూ అందరికి సమాన పాలనను అందిస్తున్నారు అని అన్నారు.ప్రతి గడపకు తనదైన శైలిలో వివరిస్తూ జగనన్నను గేలిపించుకోవలని,ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కరణం వెంకటేష్ బాబు అయినా నన్ను మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ గెలిపించి, జగనన్నను ఆశీర్వదించలని ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లు పద్మవతి, మల్లవరపు ఏడుకొండలు, వాకా శివ,వల్లు రమేష్,మాజీ సర్పంచ్ సురేష్,బుర్ల నాగరాజు,మార్పు జయరావు, దుర్గారావు,మల్లవరపు కృష్టారావు,పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర డైరెక్టర్లు,జిల్లా నాయకులు,చీరాల  మరియు  వేటపాలెం మండల నాయకులు, సర్పంచులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు ,RBK చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు,మునిసిపల్ కౌన్సిలర్లు,వార్డు ఇన్చార్జిలు,కోఆప్షన్ సభ్యులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు,జగనన్న అభిమానులు, కరణం అభిమానులు, గ్రామ ప్రజలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....

No comments