Latest News

చంద్రబాబు సభను విజయవంతం చేయండి: ఎం.ఎం కొండయ్య

బాపట్ల జిల్లా(chirala ):చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి మద్దులూరి మాల కొండయ్య శనివారం పాత్రికేయ మిత్రులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఓటమి భయంతో వైసిపి నేతలు ప్రతిపక్షాలపై దాడులు హత్యలకు తెగబడుతున్నారు అని ఆరోపించారు. ఆదివారం బాపట్ల లో జరుగు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భారీ సభకు వేలాది మంది పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి అనేది లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని రాజధాని ఉన్నటువంటి రాష్ట్రంగా అనేక రకాలైన పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా సూపర్ సెక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలలో పార్టీపై నాపై నమ్మకం ఏర్పరిచామన్నారు. రాబోయే ఎన్నికలలో ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, బొగ్గుల పార్థసారథి, శ్రీనివాస్ తేజ, కొండ్రు రత్నబాబు, కౌతారపు జనార్ధన్, కోమ్మనబోయిన రజిని, సిద్ధిబుచ్చేశ్వరరావు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

No comments