Latest News

చీరాలలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం....


  


బాపట్ల జిల్లా (chirala ) : చీరాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  మరియు బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి మాజీ జెడ్పిటిసి గుద్దాంటి చంద్రమౌళి అధ్యక్షతన చీరాల గోలి సధానందరావు కళ్యాణమండపములో శంఖారావం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  అధ్యక్షులు కింజారాపు అచ్చెన్నాయుడు ని కలిసి చీరాల టిడిపి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేయటం జరిగింది అని అన్నారు. చీరాల నియోజకవర్గంలో బిసి లు ఎక్కువగా ఉండటం వలన సీనియర్ ఆయిన నన్ను చీరాల లో పోటీ చెయ్యమన్నారు అని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీ ని విడిచి పోకుండా ఉన్నాను అని తెలియజేసారు.తెలుగుదేశం పార్టీ అధిష్టానం నామీద నమ్మకంతో చీరాల లో చేనేత కార్మికులు అండతో మరియు కుల,మత, బేధాలు లేకుండా బడుగు బలహీన వర్గాలందరిని కలుపుకొని    తెలుగుదేశం పార్టీ కి గెలుపు దిశగా  కృషి చేయాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల వెంకటేశ్వర్లు,అందే ఉమామహేశ్వరరావు,కర్ణ శ్రీనివాస రావు,సయ్యద్ ముంతారహర్,సూరగాని బాలశంకర్,అవ్వారు సాంబయ్య, పఠాన్ గౌస్,వంశీ కృష్ణ,గుత్తికొండ కిషోర్ మరియు మహిళా నాయకులు నందం లావణ్య,కర్పూరపు,నాగదుర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments