Latest News

26న చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులుకు శ్రీకారం:రైల్వే సూపరిండెంట్ సింగయ్య


చీరాల (chirala): చీరాల రైల్వే స్టేషన్ లో సూపరిండెంట్ సింగయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ఈ నెల 26న చీరాలలో జరిగే రైల్వే అభివృద్ధి పనులకు సంబదించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా సూపరిండెంట్ సింగయ్య మాట్లాడుతూ... అమృత్ భారత్ స్టేషన్ పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 554 స్టేషన్ ల పునరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింద్దన్నారు.  వీటిలో భాగంగా రోడ్డు,ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.26న రైల్వే ఉన్నతాధికారులు,ప్రజా ప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు ఉంటాయన్నారు. చీరాల లోని  ప్రజానికం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్నీ జయప్రదం చేయాలని కోరారు.

No comments