Latest News

సముద్ర స్నానాల్లో జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై ఎం.వి శివకుమార్

చీరాల(vodarevu):ఓడరేవు రామపురం సముద్ర తీరాలకు వచ్చిన ఆ పర్యాటకులు జాగ్రత్తలతో  స్నానాలు ఆచరించాలని సముద్ర స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు అని ఈపురుపాలెం ఎస్సై ఎం వి శివకుమార్ అన్నారు .అయన ఆదివారం తీర ప్రాంతం లో  పర్యాటకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆదివారం కావడంతో పెద్ద యెత్తున సముద్ర స్నానాలకు వచ్చిన యాత్రికులకు జాగ్రత్తలు తెలిపారు.రెండు అలలు దాటి లోపలికి వెళ్ళి స్నానాలు చేయడం ప్రమాదకరం అన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే సముద్ర స్నానం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.చిన్న పిల్లలను, వృద్ధులను ఒంటరిగా వదలరాదని సూచించారు.అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ఇబ్బంది ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మెరైన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments