Latest News

చీరాల నుంచి కచ్చితంగా నేనే పోటీచేస్తా: ఎం ఎం కొండయ్య

చీరాల (chirala):చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇంచార్జి ఎం ఎం కొండయ్య ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ...టిడిపి జనసేన ఉమ్మడి జాబితా పై కొండయ్య  హర్షం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో టిడిపి తరుపున పోటీ చేసేది నేనే అని అన్నారు. నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో నాపేరు ఉంటుంది అని అన్నారు.చీరాల ప్రజలు గాని, తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు గాని, ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.వైసిపి నేతల చెంప చేల్లుమనే విధంగా అధినేతలు బలమైన అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేశారు అన్నారు.ఇక రెండో జాబితాలో చీరాల నుంచి తమ పేరు కచ్చితంగా ఉంటుందని దీంట్లో ఏమాత్రం సందేహం లేదని వెల్లడించారు. సీనియర్లు  మాజీ మంత్రులు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టమైన సమీకరణాల కోసం రెండో జాబితా పై పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు .బీసీ నియోజకవర్గమైన చీరాలలో బీసీ అయిన తానే పోటీ చేస్తానన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి ని చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు,డేటా నాగేశ్వరరావు,పురుషోత్తం, పార్థసారథి,జనార్దన్ రావు,సురేష్,టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments