బాపట్ల జిల్లా చీరాల లో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ .
బాపట్ల జిల్లా (chirala) : చీరాల పట్టణంలోని ముక్కోణం పార్క్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ లో సోమవారం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహాని ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి అని కొనియాడారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ భారత దేశ ప్రజలకు స్ఫూర్తి ఇచ్చిన మహనీయుడని కొనియాడారు. రాష్ట్రాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆశించి ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు. చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించే బాధ్యత అందరి పైన ఉందన్నారు. అంబేద్కర్ ఒక దళిత జాతికి సంబంధించిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్స్, పార్టీ అధ్యక్షులు, చైర్మన్, వైస్ చైర్మన్లు, మునిసిపల్ కౌన్సిలర్లు , వార్డు ఇంచార్జీ, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా నాయకులు, వివిధ హెూదాల్లో ఉన్న నాయకులు, మునిసిపల్ సిబ్బంది,ప్రజా సంఘాల నాయకులు,అంబేద్కర్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
No comments