Latest News

డిగ్రీ సెమిస్టర్ లో బి.బి.హెచ్ డిగ్రీ కాలేజ్ సత్తా


                                                    బాపట్ల జిల్లా(vetapalem ): ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వారు 12వ తేదీన ప్రకటించినటువంటి డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలలో వేటపాలెం బండ్ల పాపయ్య హిందూ డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా సోమవారం బండ్ల బాపయ్య హిందూ డిగ్రీ కాలేజీలో జరిగినటువంటి అభినందన సభలో కళాశాల ప్రిన్సిపల్ జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ...ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలలో మా కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మాకు,మా కళాశాలకు,విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.అనంతరం కళాశాలలో జరిగినటువంటి అభినంద సభలో విద్యార్థిని విద్యార్థులను కాలేజీ సిబ్బంది అభినందించారు.అంతేగాక ముందు ముందు విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని కోరారు.ఈ ఫలితాలలో బికామ్ హనర్స్ నందు డి సాయి రిషిత,జి సుమంత్,జి వెంకట్,ఏ అలేఖ్య, బిఏ హానర్స్ నందు ఎమ్ తనుష్, జి లతామాధురి,బిఎస్సి  హనర్స్ నందు  డి సుమన్,జి కుమార్ లను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎం హేమసుందర్ రావ్,డీజే సంజీవ్,జి హరీషా,ఆర్ రాధాకృష్ణ,టి సుబ్బారావు,ఎం వంశీ మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

                                                 



No comments