పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన ఎస్సై:ఎమ్ వి.శివకుమార్
చీరాల మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఈపురుపాలెం ఎస్సై శివకుమార్
పరిశీలించారు.ఈ సందర్భంగా తోట వారిపాలెం, పిట్టువారి పాలెం గ్రామంలోని పోలింగ్
కేంద్రాలను పరిశీలించి బూత్ నంబర్ తదితర వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా
ఎస్సై మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నామన్నారు.
ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులపై ఆరా
తీస్తున్నామని అన్నారు.పోలింగ్ సమయంలో అల్లర్లకు పాల్పడే వారి వివరాలు సేకరించి
వారిపై నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments