Latest News

రా కదలి రా సభను ప్రజలు విజయవంతం చేయాలి :టిడిపి యువ నాయకులు గౌరి అమర్నాధ్


బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇంకొల్లులో ఈనెల 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ 

చేపట్టిన రా కదిలి రా చంద్రబాబుసభకు మాజీ మంత్రివర్యులు. కొల్లు రవీంద్ర పర్చూరు 

శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాలు టిడిపి యువ నాయకులు గౌరి అమర్నాధ్ 

ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం భూమి పూజ 

శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ ప్రాంగణాన్ని తారకరామా విజయభేరి సభాస్తలిగా 

నామకరణం చేసి పూజ కార్యక్రమాలు  నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 

నాయుడు25పార్లమెంటునియోజకవర్గాలలో తలపెట్టిన  రా కదిలి రా సభలలో భాగంగా 

చివరి సభ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధి పర్చూరు నియోజకవర్గం లో అని 

 అన్నారు. ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ... గడిచిన 4సంవత్సరాల

9నెలలో వైసిపి అరాచక ప్రభుత్వం కు చరమ గీతం పాడటం కోసం ఈ సభ పెద్ద ఎత్తున

 నిర్వహిస్తున్నామని బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, జిల్లాలోనే 

మిగతా అన్ని ప్రాంతాల నుండి సుమారు లక్ష మందితో  రా కదిలిరా సభ జరుగుతుందని,

 దానికి తగిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున  సభను

విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...

వైసిపి తట్టా బుట్ట సర్దుకుని ఇంటికి వెళ్ళటమే మిగిలిందని, తెలుగుదేశం పార్టీ వచ్చే 

ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తుందని అందులో భాగంగానే ఈ రా కదిలి రా సభను పెద్ద 

ఎత్తున నిర్వహిస్తున్నామని, బాపట్ల, ప్రకాశం జిల్లా ప్రజలు ఈ సభను పెద్ద ఎత్తున

విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ యువ 

నాయకులు గౌరి అమర్నాధ్, కనిగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి,

మాజీ శాసనసభ్యులు బి,ఎన్ విజయకుమార్, బాపట్ల మాజీ శాసనసభ్యులు వేగేసిన 

నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీ  అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తదితర 

తెలుగుదేశంపార్టీ  నాయకులూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


No comments