బీసీలపై వైసిపిది కపట ప్రేమ మాత్రమే.
చీరాల తెలుగుదేశం పార్టీ కార్యలయంలో గౌరీ అమర్నాధ్ మాట్లాడుతూవైకాపాలో జగన్
మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడతో బీసీ నాయకులు బయటకు వస్తున్నారు అని అన్నారు.
వైసీపీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి బయటకు వచ్చి బీసీ నాయకులకు పార్టీలో
గౌరవం లేదని అన్నారు. బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని ఆ పార్టీలోని నేతలే
అంటున్నారు అని అన్నారు.జంగా కృష్ణమూర్తి చెప్పడంతో జగన్ రెడ్డి అసలు స్వరూపం
బయటపడింది అని అన్నారు. బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమను చూసి ఓట్లు వేసి బీసీ
సోదరులు అంతా మోసపోయారు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు,
బడుగూ బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు గా మారింది అని అన్నారు. సామాజిక
న్యాయం అని పేరుతో బీసీలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఎంతోమంది బీసీ
నాయకులు వైకాపాకు దూరం అవుతున్నారు అని అన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక
శాతం ఉన్న బీసీలకు వైసీపీలో సరైన న్యాయం జరగలేదు అన్నారు. నా ఎస్సీ, నా బీసీలు
అని జగన్ రెడ్డి ప్రేమతో ఆయా సామాజిక వర్గాల వారిని వంచిస్తున్నాడు.బీసీలకు
తాత్కలికంగా కొన్ని పదవులు ఇచ్చి నోరు మూయిస్తున్నారు అన్నారు. కేవలం పదవులు
ఇవ్వడం సామాజిక న్యాయమా, రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు 56 కార్పొరేషన్లు
ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప కార్పొరేషన్లకు నిధులే
లేవు. వైసీపీలో బీసీలు తమ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారు అని అన్నారు.
No comments