ఏలూరు సాంబశివరావును కలిసిన గుద్దంటి చంద్రమౌళి
చీరాల నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేశానని పార్టీ
పెద్దలు ఆశీర్వాధిస్తే గెలుస్తానని బాపట్ల పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి మాజీ
జెడ్పిటిసీ గుద్దంటి చంద్రమౌళి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అద్దంకి
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను కోరారు. గురువారం పర్చూరు టీడీపీ రా కదలిరా సభ
ప్రాంగణంలో చీరాల అసెంబ్లీ టికెట్ కేటాయింపుకు మద్దతివ్వాలని బాపట్ల పార్లమెంట్
అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు, ఏలూరి సాంబశివరావు, అద్దంకి శాసనసభ్యులు
గొట్టిపాటి రవికుమార్ ని కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ టీడీపీ
అధికార ప్రతినిధి గుద్దంటి చంద్రమౌళి మాట్లాడుతూ టీడీపీ పెట్టిన నాటి నుంచి పార్టీ
కోసం కృషి చేస్తున్నానని పార్టీ చీరాల ఎమ్మెల్యే గా అవకాశం కల్పిస్తే గెలిచోస్తానని
అన్నారు. అత్యధికంగా చేనేతలు ఉన్న చీరాల లో అవకాశం సీనియర్ నాయకుడిగా
తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్
లను కోరామని పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు,ఎర్రకులప్రసాదు, సయ్యద్
ముతహర్,సేలందేవరాజు,పొట్టేటి పాండు,నరసింహారావు ,తిరుమలేశరావు ,తదితరులు
పాల్గొన్నారు..
No comments