టీడీపీ రా కదలిరా సభను జయప్రదం చెయ్యండి:గుద్దంటి చంద్రమౌళి
ఇంకొల్లులో ఫిబ్రవరి 17 న నిర్వహించనున్న రా.. కదలిరా' సభ భారీ ఎత్తున టీడీపీ
నాయకులు కార్యకర్తలు పాల్గొనలని బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి మాజీ
జెడ్పిటిసీ గుద్దంటి చంద్రమౌళి అన్నారు. శుక్రవారం ఈపురుపాలెం పురుగుల పేటలో
టీడీపీ రా కదలిరా సభకు సన్నాహక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
చంద్రమౌళి మాట్లాడుతూ బీసీలను చట్టసభలకు పంపిన ఘనత టిడిపి కే
చెందుతుందన్నారు.అణచివేత పెరిగినప్పుడు ప్రతి పౌరుడు పోరాడాల్సిందేనని ప్రజల
కోసం పోరాడుతున్న చంద్రబాబు సభలో పాల్గొని ఆయన పోరాటానికి మద్దతు
తెలపాలన్నారు.ప్రజా సంక్షేమమే చంద్రబాబు ద్యేయమని రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు
తోనే సాధ్యమని రాబోయే ఎన్నికలలో చంద్రబాబు కు ఓటు వేయాలన్నారు.....
ఈ కార్యక్రమంలో ఇపురుపాలెం టీడీపీ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు,అందే
ఉమామహేశ్వరరావు ,అవ్వారు సాంబయ్య, సేలం దేవరాజు,నందం లావణ్య,సయ్యద్
ముతహర్,విన్నకోట జగదీష్, కొప్పు రంగరావు, సాధు లక్ష్మయ్య, గుర్రం
తిరుమలేశ్వరారావు, ఆకురాతి ఏడుకొండలు, సురగాని బాల చంద్ర, గుండపు
సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు..
No comments