రా కదలి రా సభను విజయవంతం చెయ్యాలి : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
చీరాల టిడిపి కార్యాలయంలో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ
సమావేశానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చీరాల
టీడీపీ యువ నాయకులు గౌరి అమర్నాధ్ అధ్యక్షత న సమావేశం జరిగింది.ఈ
సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ, ఈ 17 తేదిన ఇంకొల్లులో జరిగే రా కదలిరా సభను
జయప్రదం చేయాలని అన్నారు.సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది ,చంద్రబాబు
సభలను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారు అని తెలిపారు.ఎన్నికల
కోడ్ కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన
సీఎం జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజల సిద్ధమయ్యారు అన్నారు.
టిడిపి జనసేన ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అని అన్నారు.వైసీపీ
ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి తెలిపారు.జగన్ బుద్ధి ఎలాంటిదో సొంత చెల్లి షర్మిల
నేడు ప్రజల ముందుకు వచ్చి చెబుతుంది అని తెలిపారు.రాష్టం గాడిలో పడాలంటే
చంద్రబాబు సీఎం అవ్వాల్సిందే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని
గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌరీ అమర్నాధ్,నాతాని
ఉమామహేశ్వరరావు, గజవల్లి శ్రీనివాసరావు, డేటా నాగేశ్వరరావు, పార్థసారథి, పద్మిని
తదితరులు పాల్గొన్నారు.
No comments