Latest News

ఔన్నత్యం చాటుకున్న జర్నలిస్ట్ మేరీకుమారి...

చీరాల(chirala): అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ సమాజ సేవ ఆధ్వర్యంలో క్యూ5 మీడియా ప్రతినిధి మేరీకుమారి బుధవారం చైతన్య మనోవికాస రీహాబీలేషన్ సెంటర్ అనాధ ఆశ్రమంలో మానసిక వికలాంగులుకు పులిహార,పండ్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనాధ ఆశ్రమం ఆర్గనైజర్ వెంకయ్య మాట్లాడుతూ మా ఆశ్రమానికి పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ లాంటివాళ్ళు పండ్లు, కాయలు సహాయం చేయడం ద్వారా వాళ్లకి ఆరోగ్యపరంగా చాలా ధైర్యాన్నిస్తుందని అన్నారు. అంతేకాక చాలామంది ఆర్గనైజేషన్స్ చీరాలలోని మా ఆశ్రమానికి సపోర్ట్ చేస్తున్నారు  అన్నారు. నేడు సమాజ సేవలో మాకు కొత్తగా క్యూ5 మీడియా ప్రతినిధి మేరీకుమారి వికలాంగులకు సహాయం చేయడంలో ముందుకు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమమే కాకుండా ఇంకా ముందు ముందు పేదలకు గాని వికలాంగులకు కానీ ఇలాంటి చేయూతనిస్తామని వారు తెలిపారన్నారు. దీనికి మా ఆశ్రమం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. వాళ్ల కోసం మేము తోడు ఉంటాం, మాఆనాధ పిల్లల కోసం వాళ్లు తోడు ఉంటారని అన్నారు. అనంతరం మేరీకుమారి మాట్లాడుతూ మాకు వచ్చే సంపాదనలోనే సగం పేదలకు, వికలాంగులకు, సహాయం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు, వికలాంగులకు అనాధ ఆశ్రమాలకు మాయొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యూ5 మీడియా ప్రతినిధి కుమారి, చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పేర్ల బుజ్జిరాజు,మహేష్,సాయి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments