Latest News

ఘనంగా సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాల శత దినోత్సవ వేడుకలు

చీరాల(chirala):చీరాల పట్టణం సెయింట్ మార్క్స్ లూదరన్ జూనియర్ కళాశాల శత దినోత్సవ వేడుకలు శనివారం కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి దేవరపల్లి షాలోమ్ రాజ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.చదువు ప్రతి మనిషి తలరాతను మార్చేస్తుందని దీనికి కులం,మతం,పేద,ధనిక వర్గ తారతమ్యాలు ఏమీ లేవన్నారు. నాడు కటిక పేదరికంతో ఉన్న ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నత హోదాల్లో నిలిచారంటే  దానికి చదువే మూల కారణమన్నారు. తరగతి స్థాయినించే విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు.తోటి మిత్రులు, సన్నిహితులు విజయాలను కూడా స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదవాలన్నారు.అనంతరం అతిథిగా విచ్చేసిన అధికారి షాలోమ్ రాజుకు కళాశాల బృందం సత్కారం నిర్వహించారు.కళాశాల విద్యార్థులు సాంస్కృతిక విన్యాసాలు పాటలు డ్యాన్స్ లతో అందరిని ఆకర్షితులను చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షులు గారపాటి పుష్పరాజు,కరస్పాండెంట్ విద్యాసాగర్,ఎజ్రా, జయశీలారావు,సిపోరా,నూకతోటి శ్రీకాంత్,లక్ష్మయ్య,మరియు అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments