Latest News

చీరాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ఎం కొండయ్య

చీరాల(chirala):రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద వీరరాఘవ స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...చీరాల అసెంబ్లీ టికెట్ మద్దులూరి మాల కొండయ్యకు కేటాయించారని పని పాట లేని వారు అదే పనిగా టీడీపీ పై చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడేది,గెలవబోయేది కొండయ్యేనని దుష్ప్రచారాలు టీడీపీ కార్యకర్తలు నమ్మవద్దని అన్నారు.గతంలో చీరాల నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఒక పెద్దాయనను తీసుకొచ్చి గెలిపించింది చంద్రబాబేనని  గెలిపించాక ఆ పెద్దాయన పార్టీ వీడి పోయారని అన్నారు.ప్రస్తుతం చంద్రబాబు చీరాల అసెంబ్లీ టికెట్ కొండయ్య కు కేటాయించారని అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు ఉన్న చీరాలలో కొండయ్యను గెలిపించుకు తీరుతామని అన్నారు.జనసేన నాయకులు అలా శ్రీధర్ మాట్లాడుతూ...జనసేన టిడిపి పొత్తులో భాగంగా అసెంబ్లీ సిటు ఎవరికి కేటాయించిన వారి గెలుపుకు జనసేన కృషి చేస్తుందని,ప్రతి జనసైనికుడు అభ్యర్థి గెలుపుకోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన పై వస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని రాష్ట్రాభివృద్ధికి టీడీపీ గెలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షలు గజవల్లి శ్రీనివాసరావు, కొండ్రు బాబ్జి,లావేటి శ్రీనివాస తేజ,ఆళ్ల శ్రీధర్,మస్తానమ్మ,కుంస్హాల వీరాంజనేయులు,శామ్యూల్,నరాల తిరుపతి నాయుడు,పళ్ళ గొర్ల మస్తాన్ రావు,గుంటి గాంధీ,మోహన్ గౌడ్,వంశీ,పాకల పాండు తదితరులు పాల్గొన్నారు.

No comments