Latest News

మున్సిపల్ కమిషనర్ బదిలీ

బాపట్ల జిల్లా (chirala): చీరాల మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న విజయసారధి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన స్థానంలో  విజయనగరం జిల్లా పార్వతిపురం లో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ సింహాచలం ను చీరాలకు నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.గత 15 రోజుల క్రితమే చీరాల మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మునిసిపల్ మరియు సచివాలయ  సిబ్బంది,వార్డ్ సభ్యులు,చైర్ పర్సన్,మున్సిపల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో కౌన్సిల్ హల్ నందు అభినందన వీడ్కోలు సభ జరగగా ఆయనను ఘనంగా సత్కరించటం జరిగింది. అనంతరం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ... అనతి కాలంలోనే అందరి మన్ననలు చోరగున్న ఏకైక కమిషనర్ విజయసారధి అని కొనియాడారు.ఎలక్షన్ అనంతరం చీరాల మునిసిపల్ కమిషనర్ గా రావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధముగా అటెండర్ స్థాయి నుంచి బిల్లు కలెక్టర్ వరకు దాదాపు 40 సంవత్సరాలు మున్సిపాలిటీకి  ఎన్నో సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న టి.చెన్నయ్య వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ( బిల్లు కలెక్టర్)రిటైర్డ్ అయిన సందర్భంగా వారిని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్ డోర్ మరియు ఔట్ డోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments