Latest News

తీర ప్రాంతానికి వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ఎం.వి శివకుమార్

సముద్ర స్నానానికి చీరాల తీరప్రాంతానికి వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని ఈపురుపాలెం ఎస్సై ఎం. వి. శివకుమార్ అన్నారు.ఆదివారం చీరాల వాడరేవులో సముద్రస్నానాలకు వచ్చిన యాత్రికులకు సముద్ర స్నానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పై శివకుమార్ మాట్లాడుతూ సముద్ర స్నానం చేసేవారు లోతట్టు ప్రాంతానికి వెళ్లకుండా రెండవ అల దాటకుండా తీరం వెంబడే స్నానాలు చెయ్యాలన్నారు. సముద్ర స్నానాలకు వచ్చే యాత్రికులు తమ సామానులకు వారే బాధ్యత వహించాలని, మద్యం త్రాగి సముద్ర స్నానం చేయరాదన్నారు. అపరిచిత వ్యక్తులు అమ్మే తినుబండారాలు కొనకుండా ఉండాలన్నారు.



 

No comments