Latest News

భవనం పై నుంచి జారీ పడి వ్యక్తి మృతి

చీరాల(chirala): చరవాణి మాట్లాడే క్రమంలో ప్రమాదవశాత్తు లాడ్జీ భవనంపై నుంచి జారీ పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు భీమవరం వ్యవసాయ శాఖలో అటెండర్గా పనిచేస్తున్న కరుణ కుమార్ (42) స్నేహితులలో కలిసి బుధవారం వేకువ జామున వేటపాలెంలోని ఓ ఇంట్లో శుభకార్యం నిమిత్తం చీరాలకు చేరుకున్నాడు. స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జీలో రూం బుక్ చేసుకుని సరాదాగా గడుపుతూ మధ్యం సేవించాడు. మద్యం మత్తులో ఫోన్లో మాట్లాడుతూ లాడ్జీ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి అక్కడిక్కడేమృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ శేషగిరిరావు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, అనుమాన స్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.

No comments