Latest News

చెట్టును ఢీ కొని యువకుడు మృతి.

చీరాల (chirala): ద్విచక్ర వాహానంలో పెట్రోల్ అయిపోతుందనే హడావిడిలో చౌక్ వేసి రేస్ పెంచడంతో  వేగంగా వెళ్ళిన ద్విచక్ర వాహానం చెట్టును ఢీ కొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన బుధవారం మండలంలోని వాడరేవు రహదారిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వాడరేవు గ్రామానికి చెందిన యువకుడు శశిధర్(20) వాడరేవు నుంచి చీరాల ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో పెట్రోల్ అయిపోతుండడంతో చౌక్ వేసి రేస్ పెంచడంతో  ద్విచక్ర వాహనం వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో శశిధర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాధాన్ని గుర్తించిన స్థానికులు శశిధర్ను చీరాల ఏరియా వైద్యశాలకు ప్రైవేట్ వాహనంలో తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు హాస్పటల్కు వచ్చేలోపే శశిధర్ మృతి చెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని, మృత దేహాన్ని పరిశీలించి, వివరాలు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

No comments