Latest News

కాపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు...

చీరాల(chirala):జనసేన పార్టీ నేత రావూరి బాలాజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాపు సేవా ట్రస్ట్ సామాజిక సేవలు ప్రశంసనీయమని నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చీరాల చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రావూరి బాలాజీ మాట్లాడుతూ...స్వర్గీయ రావూరి వెంకటసుబ్బయ్య,మీనాక్షమ్మల జ్ఞాపకార్థం చీరాల కాపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ,పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కార్తీక పౌర్ణమి నాటి నుంచి ఇప్పటి వరకు 13వ వారం  నిరంతరం నిర్వహిస్తున్న అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ  పార్వతీపురం యానాది కాలనీలోని జనసైనికులు మరియు వీర మహిళల ఆధ్వర్యంలో స్థానిక పెద్దలందరు సమక్షంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు రావూరి వెంకటేశ్వర్లు,కోటేశ్వరమ్మ నిర్వహణలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు సమిష్టి కృషితో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. పేద  ప్రజలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం విజయవంతమైనది అని తెలిపారు.  అనంతరం కాపు సేవా ట్రస్ట్ సేవలను ప్రశంసిస్తూ నిర్వాహకులను జనసైనికులను పేద ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు కారంపూడి పద్మిని,తదితరులు పాల్గొన్నారు.

No comments