Latest News

వైభవంగా శ్రీజానకీ రామాంజనేయ స్వామివారి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవం

చీరాల(chirala) : శ్రీజానకీ రామాంజనేయ స్వామి వారి పాలరాతి విగ్రహా ప్రతిష్టా మహోత్సవానికి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు హాజరయ్యారు. స్థానిక జవహర్ నగర్ లోని శ్రీజానకి రామాంజనేయ స్వామి దేవాలయంలో పాలరాతి విగ్రహా ప్రతిష్ట గురువారం ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరణం వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,వైసీపీ నాయకులు కరణం వెంకటేశ్ బాబుకు ఘన స్వాగతం పలుకుతూ గజ మాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్, కంపా అరుణ్, కొమ్మూరి రాజేష్, కట్టా రాము, వెంకట స్వామి దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్ ఉదయ ప్రసాద్ (బుజ్జి), వంగర శ్రీనివాసరావు, జొన్నాదుల శ్రీనివాసరావు, బుడ్డాబత్తుని ఆంజనేయ ప్రసాద్, బోదాటి పూర్ణచంద్రరావు, వల్లపు శ్రీనివాసరావు, తుమ్మ వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments