Latest News

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

చీరాల(chirala):చీరాల నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమం నిర్వహించారు. తెదేపా ఇంఛార్జి మద్దులూరి మాలకొండయ్య తనయుడు యువ నాయకులు గౌరీ అమర్నాథ్,బాపట్ల పార్లమెంట్ నాయకులు మొవ్వ శరత్ చంద్ర ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓట్లు నమోదు చేసుకోవాలన్నారు. నూతన ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు హక్కును ఉపయోగించు కోవాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటుబడే నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. వైకాపా అరాచక పాలనను అంతమొందించి రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపాను ఆదరించాలని కోరారు. శరత్ చంద్ర మాట్లాడుతూ మన రాష్ట్రంలో కంపెనీలు వచ్చి అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే వజ్రాయుధం లాంటి మీ మొదటి ఓటును నారా చంద్రబాబు నాయుడుకి వేయవలసిందిగా కోరారు. యువత ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంజి పురుషోత్తం, కొమ్మనబోయిన రజని, కౌతరపు జనార్ధన్ రావు,శరత్ చంద్ర, లావేటి తేజ, భరత్ కుమార్, మొహిద్దిన్, జగదీష్, స్థానిక తెదేపా నాయకులు, నూతన ఓటర్లు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments