అధికారులు చిత్తశుద్ధి లోపంతోనే సమస్యలు :చీరాల అభివృద్ధి సాధన సమితి
సమస్యలు ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందని శీలం రవికుమార్ అన్నారు.
గురువారం చీరాల ఎన్జీవో హోం లో అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలోచీరాల
అభివృద్ధి కోసం ఇచ్చిన సమస్యల పరిష్కారం చెయ్యాలని విలేకరుల సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చీరాల అంబేద్కర్ సర్కిల్ లో
ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహం విషయంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని
తుంగలో తొక్కారన్నారు. చీరాల దండుబాటలో మురుగు\నీరు మంచి నీటిలో
కలుస్తున్నాయని దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. స్మశాన వాటికల
ఆక్రమణలు అరికట్టాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే అధికారులు సమస్యలు
పరిష్కరించకుండా గాలికొదిలేసారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వేదిక వ్యవస్థాపక
అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్,
ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతుని బాబురావు, జనసేన నాయకులు
గూడూరు శివరామ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు అంబటి పుష్పరాజ్ , బీసీ నాయకులు
ఉటుకూరి వెంకటేశ్వర్లు గాదె హరిహారరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments