Latest News

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు చేసుకున్న దేవరపల్లి బ్లాండీనా

చీరాల (chirala): చీరాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శ్రీమతి దేవరపల్లి బ్లాండిన గురువారం  దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా విజయవాడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  దరఖాస్తు పత్రాలను చీరాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దేవరపల్లి రంగారావు సమక్షంలో సమర్పించారు.అనంతరం బ్లాండిన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని అదేవిధంగా గతంలో మా భర్త దేవరపల్లి రంగారావు 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు పార్టీ తరఫున ప్రచారకర్తగా తిరిగి చీరాల ప్రజలతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం జరిగిందన్నారు.అంతేకాక  ఆంద్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు.రాబోయే ఎన్నికల్లో చీరాలలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించునుకుంటామన్నారు.తాను సమర్పించిన అభ్యర్థనను అధిష్టానం మనస్ఫూర్తిగా స్వీకరించి చీరాల అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments