Latest News

చీరాల అభివృద్ధి మా లక్ష్యం : ఎమ్మెల్యే కరణం బలరాం


బాపట్ల జిల్లా  (vetapalem):వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామ పంచాయితీ పరిధిలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన దేశాయిపేట-1 సచివాలయం,17 లక్షల 50 వేల రూపాయల తో స్మశాన వాటిక చుట్టు నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడలు మరియు దేశాయిపేట పంచాయితీ పరిధిలో 10 కోట్ల 13 లక్షల రూపాయలతో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను  చీరాల శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణ మూర్తి మరియు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యమని కులాలకి,మతాలకి,పార్టీలకి,వర్గాలకి అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రూతుమ్మ, పంచాయితీ రాజ్ డి ఈ శేషయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ రామ్ కుమార్, పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్ కందేటి రమణ, ఉప సర్పంచ్ దంతం  వెంకట సుబ్బారావు, జె సి ఎస్ మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్,యువత అధ్యక్షులు ఆవుల అశోక్, ఆర్ బి కే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు సీత మహాలక్షి, ఉపాధ్యక్షులు అందే కృష్ణ,జంగిలి రామారావు, కట్టా గంగయ్య, చల్లా జనార్దన్ రావు, కర్ణ లక్షరావు, ప్రుద్వి చంద్రమోహన్, బొల్లాపల్లి బెంజీమన్, వేటగిరి సంజీవరావు, కర్ణ ప్రసాద్, కట్టా జార్జ్ సామ్యేల్, షేక్ ఖాదర్, దంతం హనుమంతు, బండికళ్ళ నరేష్, జమ్మి ప్రసాద్ రెడ్డి, షేక్ అజిజుల్లా, బుర్ల శివ,షేక్ హౌలీ, షేక్ సాలేహ, బుద్ధి రవి, ఏపిఎం శ్రీనివాసులు,సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు మరియు గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.

No comments