Latest News

చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృధి సాధ్యం ....


బాపట్ల జిల్లా (chirala):చంద్రబాబుతో నే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎం కొండయ్య అన్నారు.రామన్నపేట పంచాయతీ పరిదిలో దంతం వారి కళ్యాణ మండపం నందు జయహో బీసీ సమావేశం క్లస్టర్ 10 యూనిట్స్, బూత్ ఇన్చార్జిలు, కుటుంబ సాధికారులు,కుల సాధికారుల శిక్షణా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.ఎం కొండయ్య మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 2024 అధికారం చేపట్టిన వెంటనే చేపట్టు  సూపర్ సిక్స్ పధకాలను, బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరించటం జరిగినది. మంచి పరిపాలన, మహిళల భద్రత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు  ముఖ్యమంత్రిగా మనము ఎంపిక చేసుకుంటేనే రాష్ట్ర ప్రగతి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బొగ్గుల పార్థసారథి, నాసిక వీరభద్రయ్య, షేక్ సుభాని, కౌతరపు జనార్ధనరావు, గుత్తి వీరప్రసాదరావు, చింతా రామకృష్ణారావు, ఉమ్మిటి శంకర్రావు, జాగాబత్తుని పోతురాజు, పింజల రేణుకేశ్వరరావు, షేక్ అజీమ్, పొగడదండ వెంకటేశ్వర్లు, యర్రా శివ నాగ మల్లేశ్వరి, బిట్ర చైతన్యకుమార్, గుత్తి శివయ్య, ఉసురుపాటి సురేష్, గంజి పురుషోత్తం, పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments