Latest News

రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే టిడిపి తోనే సాధ్యం

బాపట్ల జిల్లా (chirala):రాష్ట్రాని అభివృద్ధి పథంలో నడపాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చీరాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎం ఎం కొండయ్య పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పధకాల కార్యక్రమాన్ని శుక్రవారం పేరాల చిన్నరధం సెంటర్ నుంచీ  ప్రారంభించారు.ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి లో పూజలు నిర్వహించారు.అనంతరం 4,5,6,7 వార్డుల యందు దారిపొడవునా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ... మహిళలు కు భద్రత,సంక్షేమం, మంచిపరిపాలన,ఉపాధి అవకాశాలు కల్పన కలగాలంటే చంద్రబాబు ని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని,సూపర్ సిక్స్ పథకాల వలన ప్రజలకు మంచి జరుగుతుంది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరాచక పాలన సాగిస్తున్న ఈ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి, తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు, మామిడిపాక హరి ప్రసాద్,నాసిక వీరభద్రయ్య,డేటా నాగేశ్వరరావు,ఉసురుపాటి   సురేష్, కొమ్మనబోయిన రజిని,గూడూరి శివరామ ప్రసాద్,మామిడాల శ్రీనివాసరావు,కొండ్రు రత్నబాబు,ఆర్ కె నాయుడు, పింజల సంతోష్,కారంపూడి పద్మిని,సయ్యద్ బాబు,పుప్పాల సురేష్ కుమార్,గంజి పురుషోత్తం, షేక్ మొహిద్దీన్,తాడికొండ రామాంజనేయులు, చేబ్రోలు ఆదిశేష్,మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

No comments