Latest News

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన:ఎస్పీ వకుల్ జిందాల్

బాపట్ల జిల్లా (బాపట్ల):ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్ తెలిపారు. మార్చి 01న శుక్రవారం బాపట్ల పట్టణంలోని బాపట్ల జూనియర్ కళాశాల, సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను, తీసుకున్న భద్రతా చర్యలు, పరిక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్స్, ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉండరాదన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకూడదన్నారు. తగిన ఎస్కార్ట్ తో ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్ లను, ఇతర సిబ్బందిని తరువుగా తనిఖీ చేసి మొబైల్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు వారికి కేటాయించిన విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

No comments