Latest News

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కరణం వెంకటేష్ బాబు


బాపట్ల జిల్లా(Devinuthala):చీరాల మండలం దేవినూతల గ్రామం లో చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.దీనిలో భాగంగా ముందుగా పోలేరమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు మాట్లాడుతూ...పేదల పక్షపాతి మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.ఈ నాలుగున్నర నెలల్లో వైయస్సార్సీపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మరియు చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.త్వరలో వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు.2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిపేస్టో లో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తామని బరోసానిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో మీ యొక్కఅమూల్యమైన ఓటు ను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్  ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి,బొడ్డు సుబ్బారావు,మల్లి వైష్ణవి,బత్మతుల అనిల్ల్లె కుమార్ల ,కీర్తి వెంకట్రావు , లలిత రాజశేఖర్,గోలి గంగాధర్, పులి వెంకటేశ్వర్లు,చీమకుర్తి బాలకృష్ణ,బండారు శివ పార్వతి, సల్లూరి అనిల్,ఆర్బికే చైర్మన్ కావూరి రమణారెడ్డి,పల్లపొలు శ్రీనివాసరావు ,బుర్ల సాంబశివరావు,గవిని నరేష్,గవిని వెంకటేశ్వర్లు,బుర్ల శివప్రసాద్, తోట శంకర్ వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments