Latest News

తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిద్దాం: డాక్టర్ పాలేటి రామారావు

బాపట్ల జిల్లా (chirala): తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం సహకరించాలని కోరుతూ బుధవారం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, బిజెపి ,జనసేన ,నాయకులతో కలిసి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కామధేను కాంప్లెక్స్ అధ్యక్షులు తులాబందుల సురేష్, పెనుగొండ కిషోర్, ఎక్కల శివ మోహన్ రావు లను కలిసి వారి షాపు వద్ద సమావేశమయ్యారు.ఈ సందర్భముగా డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ ...రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ , బిజేపి ,జనసేనతో కలిసి పోటి చేస్తుంది .ఆ పార్టీల గెలుపు కోసం మనం కూడా కృషి చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తేలప్రోలు వెంకటేశ్వర్లు, పువ్వాడ రామకృష్ణ, శవనం నాగేశ్వర్ రెడ్డి, కామినేడి రామకృష్ణ, ఆసాది అంజిరెడ్డి, బొమ్మిడి నాగరాజు, కీర్తి కృష్ణ, గవిని మణి, కొమ్మన బోయిన సుబ్బారావు, బిజెపి నాయకులు తడవర్తి చంద్ర, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments