Latest News

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏం.ఏం కొండయ్యను గెలిపించుకుందాం:డాక్టర్ పాలేటి రామారావు

బాపట్ల జిల్లా (chirala):మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు శుక్రవారం సాయంత్రం తన నివాసం వద్ద నియోజకవర్గ స్థాయిలో బూత్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. చీరాల అసెంబ్లీ టికెట్టు ఏం ఏం  కొండయ్యకు కేటాయించడం జరిగిందని మనమందరం కష్టపడి పనిచేసి కొండయ్యను శాసనసభ్యుడుగా గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులు అందరూ ఏం.ఏం కొండయ్యను శాసనసభ్యుడుగా గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ డేటా జోసెఫ్ ,దేవరపల్లి బాబురావు, కటకం శ్రీనివాసరావు, శవనం నాగేశ్వర రెడ్డి , కామినేడి రామకృష్ణ, బత్తుల కోటేశ్వరరావు, ఎండ్రపాటి శామ్యూల్, చొప్పరపు కృపా దానం, కొమ్ము  పాల్ రాజ్, సుధా, చింత హరీష్,దేవరపల్లి  దావీదు, తేళ్ల మోషే, అంకారావు, ఆసాది అంజిరెడ్డి , అందే శ్రీనివాసరావు , షేక్ షమీం, సయ్యద్ అమీర్, పలువురు నాయకులు  పాల్గొన్నారు.

No comments