Latest News

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

 



చీరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య అధ్యక్షతన టిడిపి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ దాదాపుగా 42 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అనేకమంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సంపాదించి పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీని పరిచయం చేశారన్నారు. నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీలో మనందరం కలిసి పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు పొందడం జరిగిందన్నారు. అనేకమైనటువంటి విజయాలు అందుకొని ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజ్యసభలోను పార్లమెంట్ లోను శాసనసభలోను అనేక చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సంక్షేమం కోసం కష్టపడినటువంటి  పార్టీ టిడిపి పార్టీ అని అన్నారు. మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంక్షేమ పథకాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపారు. భారత దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కోండ్రు రత్నబాబు, కౌతరపు జనార్ధన్, శ్రీనివాస్ తేజ, కొమ్మనబోయిన రజిని, సుబ్బలక్ష్మి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments