Latest News

సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో ఎం.ఎం కొండయ్య.

బాపట్ల జిల్లా(chirala): చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  కొండయ్య గురువారం పట్టణంలో ని గడియార స్తంభం సెంటర్లలో టిడిపి నాయకుల తో కార్యకర్తలు తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీ  అధికారం లో కి రాగానే టిడిపి ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పధకాలను పట్టణం లోని అందరికి వివరించారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ర్టంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగై రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది రాష్ర్టం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని  తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు తెలియ జేశారు.వైసిపి దొంగలకు వ్యతిరేకంగా టిడిపి జనసేన పార్టీ పోరాడుతుందని అన్నారు.తాడేపల్లి గూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్  దద్దరిల్లింది అని అన్నారు. సిఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం లోకి తీసుకెళ్లారని అన్నారు.రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని అన్నారు.చీరాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అభ్యర్థి ని నేనె అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ,శ్రీనివాస్ తేజ,కొండ్రు రత్నబాబు,కర్పూరపు సుబ్బలక్ష్మి ,మరియు జనసేన నాయకురాలు కారంపూడి పద్మిని తదితరులు పాల్గొన్నారు.

No comments