Latest News

నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు: ఎస్సై శివకుమార్

బాపట్ల జిల్లా(chirala): వాహాన చోధకులు నిబంధనలు తప్పక పాటిస్తే ప్రమాదాలు అనేవి జరగవని ఈపూరుపాలెం ఎస్సై శివకుమార్ సూచించారు. స్థానిక పిట్టువారిపాలెం కూడలి వద్ద శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్  ఆదేశాల మేరకు నో ఎక్సిడెంట్ డేను సిబ్బందితో కలిసి ఎస్సై శివకుమార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ వాహాన చోదకులకు పలు సూచనలు, సలహాలు తెలిపారు.ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంట్స్ తీసుకొని వాహనం నడపవలెను. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈపూరుపాలెం పోలీసులు, వాహాన చోదకులు తదితరులున్నారు.

No comments